Saturday, May 4, 2024

బిజెపి శిక్షణ తరగతులు

గుంటూరు – ఫిబ్రవరి 17( ప్రభ న్యూస్ ) భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో గుంటూరు,పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల శిక్షణ తరగతుల కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని పరిపాలించిన, వారసత్వ కుటుంబ అవినీతిని వైఎస్ఆర్సిపి , తెలుగుదేశం, పార్టీల అనుసరిస్తున్న విధానంపై పూర్తిగా వివరించారు. బీసీలకు చేసిన ద్రోహాన్ని, తెలియజేశారు. జన్మభూమి నోడల్ కమిటీ, ఆదరణ పథకాల ద్వారా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మోసం చేసింది అని వివరించారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ లకు నిధులు మరియు విధులను, కేటాయించకుండా మోసం చేసిన వైనాన్ని తెలియజేశారు. బీసీ కులగణనను, రాష్ట్ర ప్రభుత్వాలు, అమలపరుచుకోమని, భారతీయ జనతా పార్టీ చట్ట సవరణ చేసినప్పటికీ, తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement