Tuesday, May 21, 2024

Bapatla – పంటకాలువలో బస్సు బోల్తా …. తొమ్మిదిమంది విద్యార్ధులకు గాయాలు

బాపట్ల జిల్లా కూచిపూడి-పెదపూడి మధ్య మంగళవారంనాడు పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అమృతలూరు మండలం కూచిపూడిలోని స్కూల్ లో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో విద్యార్థులు పాల్గొన్నారు. వేడుకలు ముగిసిన తర్వాత ఇంటికి బస్సులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, స్కూల్ బస్సు బోల్తా పడగానే విద్యార్థులు భయంతో కేకలు వేశారు. అదే రోడ్డు వెంట వెళ్తున్న ఓ వ్యక్తి పంట కాలువలో బస్సు బోల్తా పడిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే స్కూల్ బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్ధులను బయటకు తీశాడు. మరో వైపు సమీపంలో పనిచేస్తున్న కూలీలను కూడ పిలిచి విద్యార్ధులను బస్సు నుండి బయటకు తీశారు. ని ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది విద్యార్థులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement