Tuesday, April 30, 2024

Independence day – జాతీయ జెండాను ఆవిష్క‌రించిన మంత్రి బుగ్గన‌…

కర్నూలు – స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జ‌రిగిన‌ 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన సభ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి , శిక్షణ శాఖా, జిల్లా ఇంఛార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్ తో కలిసి కవాతు వాహనం నుండి సాయుధ దళ పరిశీలన చేశారు..ఏ ఆర్, సివిల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హోమ్ గార్డ్స్, ఫైర్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్లాటూన్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో చేపట్టి, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు బుగ్గన రాజేంద్రనాథ్ సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం ప్రభుత్వానికి మెరుగైన సేవలదించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను మంత్రి అందచేశారు.

వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, జేసి నారపురెడ్డి మౌర్య, సెబ్ అదనపు ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ బుట్టా రేణుక స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలు, విద్యార్థులు,ప్రజలు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నా రు.

Advertisement

తాజా వార్తలు

Advertisement