Tuesday, April 30, 2024

వ‌ర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలంటూ ప్ర‌భుత్వానికి ఉద్యోగుల మొర

అమరావతి: ఏపీలోని సచివాలయంలో రోజు రోజుకి క‌రోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్ప‌టికే న‌లుగురు ఉద్యోగులు మ‌ర‌ణించారు.. మ‌రో 40 మంది క‌రోనా భారీన ప‌డి చికిత్స పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో సచివాలయం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. కరోనాతో నలుగురు సచివాలయం ఉద్యోగులు మరణించారని ఆ లేఖలో పేర్కొంది. కనీసం 50 శాతం ఉద్యోగుల హాజరునైనా అమలు చేయాలని ప్రభుత్వానికి సంఘం విజ్ఞప్తి చేసింది. అలాగే స‌చివాల‌య ఉద్యోగులంద‌రికీ క‌రోనా పరీక్ష‌ల‌తో పాటు కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement