Friday, April 19, 2024

తెలంగాణ ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చిన హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, ర్యాలీలు, వివాహాలపై ఆంక్షలు విధించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించింది. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల బెడ్స్‌పై పర్యవేక్షణ ఏర్పాటు చేసి రోగులను కాపాడాలని ఆదేశాల్లో పేర్కొంది. 48 గంటల్లో కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్ గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే తామే ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.

అటు ప్రభుత్వం వాస్తవాలను కప్పి పుచ్చుకుండా, కరోనా మరణాలు, టెస్టులు, బెడ్స్‌పై వాస్తవ సమాచారాన్ని రోజు వారీ మీడియా బులెటిన్‌లో పేర్కొనాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement