Friday, April 26, 2024

వడ్డెర వెల్ఫేర్ బోర్డు జిల్లా సభ్యురాలిగా ఆదిలక్ష్మి

తెనాలి, ఫిబ్రవరి 18 ప్రభా న్యూస్ : గుంటూరు జిల్లా వడ్డెర వెల్ఫేర్ బోర్డు సభ్యులుగా దేరంగుల ఆదిలక్ష్మి నియమితులయ్యారు. శనివారం ఆమెకు పట్టణంలోని ప్రకాశం రోడ్డులో గల ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యాలయంలో నియామక పత్రాన్ని ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఆమెకు ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ జిల్లాలో వడ్డెరల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆమెకు సూచించారు. ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఎమ్మెల్యే శివకుమార్ సూచనలతో వైసిపి పార్టీ తనకు ఇచ్చిన వడ్డెర సంక్షేమ బోర్డు సభ్యురాలు పదవికి న్యాయం చేస్తానని వెల్లడించారు. ఎమ్మెల్యే శివకుమార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు ,ఆ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement