Monday, April 29, 2024

విద్యార్థులకు జగన్‌ మరో కానుక

అమరావతి – ఏపీ విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. జగనన్న విద్యా కానుక పథకంపై ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అకడెమిక్ ఇయర్ నుంచి జగనన్న విద్యా కానుక పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్ధి కిట్ల పంపిణీకి పాలనానుమతి జారీ చేసింది ప్రభుత్వం. 2021-22 విద్యా సంవత్సరంలో 730 కోట్ల వ్యయంతో విద్యార్ధులకు మూడు జతల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు అందిచాల్సిందిగా పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా ఈసారి విద్యార్ధులకు ఇచ్చే కిట్లలో ఒక డిక్షనరీ కూడా అందించాలని ఆదేశించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement