Thursday, May 16, 2024

మేయ‌ర్,డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ల‌కు ప్రిసైడింగ్ అధికారులు నియామ‌కం..

అమరావతి: ఎపిలో జ‌రిగిన 12 న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ఈ నెల 14వ తేదిన నిర్వ‌హించ‌నున్నారు.. హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో ఏలూరు ఓట్ల లెక్కింపు జ‌ర‌ప‌డం లేదు.. మిగిలిన 11 న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌లో మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ల ఎన్నిక‌కు ప్రిసైడింగ్ అధికారుల‌ను నియ‌మించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఆదేశించారు.. కలెక్టర్లు, జేసీలను ప్రిసైడింగ్‌ అధికారులుగా నియమించాలని పురపాలక శాఖ కమిషనర్ ను కోరారు. రెండేసి కార్పొరేషన్లు కలిగిన చిత్తూరు, కృష్ణా జిల్లాలలో జాయింట్ క‌లెక‌ర్ల‌ను ప్రిసైడింగ్ అధికారులు నియ‌మించాల‌న్నారు.. మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ల‌కు కొత్త‌గా ఎన్నికైన వారితో కౌన్సిల్ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిమ్మ‌గ‌డ్డ కోరారు.‌

Advertisement

తాజా వార్తలు

Advertisement