Monday, April 29, 2024

ప్రివిలేజ్ క‌మిటీ నుంచి నోటీస్ అందుకున్న నిమ్మ‌గ‌డ్డ‌…

అమ‌రావ‌తి – రాష్ట్ర మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై చేసిన‌ అనుచిత వ్యాఖ్య‌లపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతూ శాసనసభా హక్కుల కమిటీ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కి నోటీసులు జారీ చేసింది.. ఆ క‌మిటీ నిర్ణ‌యం మేర‌కు శాస‌న స‌భ కార్య‌ద‌ర్శి ఆ నోటీసును నేడు నిమ్మ‌గ‌డ్డ‌కు ఆంద‌జేశారు.. కాగా, నిమ్మ‌గ‌డ్డ‌పై రాష్ట్ర మంత్రులు స్పీక‌ర్ కు ఇచ్చిన ఫిర్యాదుపై స‌భ హ‌క్కుల క‌మిటీ చైౖర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలోని క‌మిటి రెండు సార్లు స‌మావేశమైంది.. ఆ స‌మావేశంలో నిమ్మ‌గ‌డ్డ‌ను వివ‌ర‌ణ కోరుతూ నోటీస్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.. దీంతో నేడు నిమ్మ‌గ‌డ్డ‌కు నోటీస్ ను స‌ర్వ్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement