Wednesday, March 27, 2024

కోవిడ్ నివారణకు హైకోర్టు చర్యలు


తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్ టెస్టులు, చర్యలపై హైకోర్టుకు ఏజీ బీఎస్ ప్రసాద్ రిపోర్ట్ సమర్పించారు. మార్చి 7,11వ తేదీల్లో 20 వేల టెస్టులు చేయడంపై హైకోర్టు ఆసంతృప్తి వ్యక్తం చేసింది. సొంతంగా సేరో సర్వేలెన్సు సర్వే చేయడానికి సమయం కావాలని ఏజీ ప్రసాద్ కోర్టును కోరారు. ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఉన్నారని ఏజీ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర సరిహద్దులు, రైల్వే, బస్‎స్టేషన్‎లో 300 మొబైల్ బస్సులతో టెస్టులు చేస్తున్నామన్నారు.


రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పబ్లిక్ గ్యాదరింగ్స్ పై ఆంక్షలు విధించాలని, అంత్యక్రియలు, పెళ్ళిల్లో 100 మందికి మించారదని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు డైలీ బులెటిన్ ఇస్తున్నామని ఏజీ చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో,నిర్మాణ ప్రాంతాలు,స్కూల్ వద్ద టెస్టులు పెంచాలని హైకోర్టు సూచించింది. ర్యాపిడ్ టెస్టుల కంటే ఆర్టీపీఆర్ టెస్టులు పెంచాలని ఆదేశించింది. రాపిడ్, ఆర్టీపీఆర్ టెస్టుల సంఖ్య వేర్వేరుగా ఇవ్వాలని పేర్కొంది. కేంద్రం విడుదల చేసిన ఎస్ఓపీ పాటించాలని తెలిపింది. అదనపు వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు సూచించింది. కోవిడ్-19 కేసుల తదుపరి విచారణ వచ్చే నెల ఏప్రిల్‎కి హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement