Saturday, May 11, 2024

కర్నూల్ లో విషాదం.. ఒకే ఇంట్లో ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకలగూడూరులో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నానమ్మ, మనుమరాలు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. ఈనెల 17న పొలం పనులు చేస్తుండగా 13 ఏళ్ల రాణమ్మ పాము కాటుకు గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాణెమ్మ పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే, మనుమరాలి మృతి విషయం తెలిసి రాణమ్మ నానమ్మ వెంకట లక్ష్మమ్మ గుండె ఆగి రాత్రి మరణించింది. దీంతో ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement