Sunday, May 19, 2024

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. శ్రీశైల మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన గవర్నర్​ తమిళిసైని కలెక్టర్ పి.కోటేశ్వర రావు,  దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్న, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లను దర్శనం చేయించారు. అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద మంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.

జిల్లా కలెక్టర్, దేవస్థాన ఈవో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్ పి సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, కర్నూలు ఆర్ డిఓ హరి ప్రసాద్, ఆత్మకూరు డిఎస్పీ శృతి తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement