Wednesday, May 8, 2024

కుటుంబ సమేతంగా తిరుమ‌ల‌ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూషణ్​ ​

తిరుమ‌ల : ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్​ హ‌రిచంద‌న్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఇవ్వాల‌ (బుధ‌వారం) మధ్యాహ్నం తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మ‌హ‌ద్వారం వద్ద అర్చకులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి గ‌వ‌ర్న‌ర్‌ని ఆల‌యంలోకి ఆహ్వానించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఈవో శ్రీ‌వారి తీర్థప్రసాదాలను గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్​కు అందించారు. కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు సివిఎస్వో శివ‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ ఈవోలు ర‌మేశ్‌ బాబు, హ‌రీంద్ర‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement