Saturday, April 27, 2024

నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం…మంత్రి గుమ్మనూరు

ఆలూరు, ప్రభ న్యూస్… నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి అధ్యక్షతన 14 కంపెనీల హెచ్ఆర్సీలు విద్యార్థినీ విద్యార్థుల నుండి వాళ్ల బయోడేటా స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి నారాయణస్వామి, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు, మండల కన్వీనర్ వీరేష్, ఎంపీపీ తనయుడు వీరేష్, సచివాలయ కన్వీనర్ ఈరన్న, దీపక్, నబి, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శంకర్, విద్యార్థినీ, విద్యార్థులు వైయస్సార్ పి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement