Saturday, May 4, 2024

ప్రభుత్వ సలహాదారు సజ్జలకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఢీకొన్న వాహనాలు..

క‌ర్నూలు : వైసీపీ ముఖ్య నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కాలేజీ వద్ద ఫ్లై ఓవర్‌పై సజ్జల కాన్వాయ్ వాహనాలు వెళ్తుండగా ఒకదాని కొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సజ్జల కాన్వాయ్ వాహనాలు స్వల్పంగా దెబ్బతినగా.. ఆయన సురక్షితంగా బయటపడ్డారు. పత్తికొండ వైసీపీ నేత కుమార్తె వివాహానికి హాజరై సజ్జల తిరిగి స్టేట్ గెస్ట్ హౌస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


కర్నూలులోని డోన్ రోడ్డులో శనివారం పత్తికొండకు చెందిన వైసీపీ నేత మురళీధర్‌రెడ్డి కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు రాష్ట్రమంత్రులు వేణుగోపాల్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఆ పార్టీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు హాజరయ్యారు, వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తన వాహనంలో కాన్వాయ్ తో పాటు స్టేట్ గెస్ట్ హౌస్‌కు చేరుకునే మార్గంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ వాహనాలు ఒకదానికొకటి అనూహ్యంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కాన్వాయ్ లోని వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రమాదంలో ఎవరికీ ఏటువంటిగాయాలు కాకపోవడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement