Wednesday, May 1, 2024

అరణియార్ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల

చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. అరణియార్ ప్రాజెక్టు నుంచి ఆదివారం ఉదయం 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 250 క్యూసెక్కుల వరద నీరు అరణీయర్ ప్రాజెక్టు లో చేరుతుంది. నీరు విడుదల కావడంతో దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అరణీయర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.85 TMC లు. ప్రస్తుతం అరణీయర్ లో నీటి నిల్వ 279.5 అడుగులు మేర ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement