Wednesday, May 15, 2024

breaking : నీట మునిగిన ‘చెన్నై’ న‌గ‌రం..రెడ్ అల‌ర్ట్..

చెన్నైలో కుండ‌పోత వర్షం కురుస్తోంది. దాంతో చెన్నై న‌గ‌రం నీట మునిగింది. దాంతో రెడ్ అల‌ర్ట్ విధించింది వాతావ‌ర‌ణ శాఖ‌. పలుప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల మోకాళ్ల లోతు నీరు నిలిచింది. వ‌ర‌ద‌ముంపు చెన్నై కార్పొరేష‌న్ ప‌రిధిలో కాల్ సెంట‌ర్ ని ఏర్పాటు చేశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. టీన‌గ‌ర్,గిండీ,సైదాపేట‌,వేల‌చ్చేరి ప్రాంతాల్లో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోద‌యింది. చెన్నైలోని ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాని నిలిపివేశారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement