Saturday, April 27, 2024

సినీ నటుడు మహర్షి గురుస్వామి ఇకలేరు.. అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూత

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీలో రైతు పాత్రలో అద్భుతంగా నటించిన గురుస్వామి ఇవ్వాల (శుక్ర‌వారం) సాయంత్రం కర్నూలులో తుదిశ్వాస విడిచారు. కొద్దీ కాలంగా అనారోగ్య సమస్యలతో ఉన్నార‌ని, ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఏడాది వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన.. ‘మహర్షి’ మూవీని కీ టర్న్ చేసే రోల్‌లో గురుస్వామి మెప్పించారు. మహేశ్ బాబు పక్కనే ఉండగా.. ఎమోషనల్ డైలాగ్స్‌ను అలవోకగా చెప్పి.. ఆకట్టుకున్నారు.

పంచెకట్టులో తలపాగ చుట్టుకుని, భుజంపై నాగలితో ‘‘రైతు అంటే ఇలాగే ఉంటారా’’ అన్నంతగా.. ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా మట్టికి, రైతుకు మధ్య బంధాన్ని చెప్పే క్రమంలో ఆయన నటన అద్భుతం.. మహర్షి అనంతరం కూడా పలు సినిమాల్లో నటించారు. గురుస్వామి స్వస్థలం కర్నూలు జిల్లా వెల్దుర్తి. ఆయన స్టేజ్ ఆర్టిస్ట్​గా ఉన్నారు. ఉద్యోగం చేస్తూనే నాటక రంగంలో రాణించారు. గురుస్వామి మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement