Saturday, May 4, 2024

Fifth List – నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలతో వైసిపి ఐదో జాబితా విడుదల

తాడేపల్లి – అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంట్‌ స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఐదో జాబితాను విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత.. మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్రకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంఛార్జిల మార్పును ప్రకటించారు.

ఐదో విడతలో.. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిల మార్పును ప్రకటించారు వాళ్లు. నెల్లూరు టౌన్‌ ఎమ్మెల్యేగా ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్‌కు ప్రమోషన్ దక్కింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది పార్టీ..

మచిలీపట్నం (ఎంపీ) – సింహాద్రి రమేశ్ బాబు

నర్సరావుపేట (ఎంపీ) – అనిల్ కుమార్ యాదవ్

తిరుపతి (ఎంపీ) – గురుమూర్తి

- Advertisement -

కాకినాడ (ఎంపీ) – చలమలశెట్టి సునీల్

అరకు. (ఎమ్మెల్యే) – రేగం మత్స్యలింగం

సత్యవేడు (ఎమ్మెల్యే) – నూకతోటి రాజేష్

అవనిగడ్డ (ఎమ్మెల్యే) – డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరడంతో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును ఈ స్థానంలో ఇన్‌ఛార్జ్‌గా నియమించారు జగన్. అలాగే నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేయడంతో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను ఈ స్థానంలో బరిలోకి దింపింది. తిరుపతి ఎంపీగా గురుమూర్తికి మరోసారి అవకాశం కల్పించారు వైసీపీ అధినేత. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను ఈసారి ఎంపీగా పంపించడంతో ఆయన బంధువు సింహాద్రి చంద్రశేఖర్ రావును ఇన్‌ఛార్జ్‌గా నియమించారు జగన్

బాధ్యతలు కూడా..

పార్టీ ఐదో జాబితా విడుదల చేసే క్రమంలో.. పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డి(రాజ్యసభ సభ్యులు)కి అదనంగా గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ బాధ్యతలను అప్పజెప్పింది. అలాగే.. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ రీజినల్‌ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది. కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజినల్‌ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించింది వైఎస్సార్‌సీపీ

ఇదిలా ఉంటే.. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ..

ఇప్పటి వరకు ఐదు జాబితాలను ప్రకటించింది వైసీపీ. వీరిలో 61 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు వుండగా.. 14 మంది ఎంపీ అభ్యర్థులు వున్నారు. మొత్తంగా 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ టికెట్స్ నిరాకరించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement