Saturday, May 18, 2024

Reliance No 1.. హురున్‌ గ్లోబల్‌ జాబితా విడుదల

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరోసారి సత్తా చాటింది. భారత్‌ నుంచి అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 2023 సంవత్సరానికి సంబంధించి హురున్‌ గ్లోబల్‌ ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీల జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్‌ 44వ స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి గత సంవత్సరం కూడా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సారి 198 బిలియన్‌ డాలర్ల విలువతో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఈ సారి కంపెనీ విలువ 2 శాతం మేర క్షీణించడంతో ఓవరాల్‌ ర్యాంకుల్లో 10 స్థానాలు కోల్పోయింది.

భారత్‌ నుంచి టాప్‌-500 జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ 60వ ర్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 68వ ర్యాంక్‌ను దక్కించుకున్నాయి. 2023లో టీసీఎస్‌ విలువ 14 శాతం పెరిగి 158 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఐదు స్థానాలను మెరుగుపరుచుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌ఈఎఫ్‌సీ విలీనం వల్ల కంపెనీ విలువ అమాంతం పెరిగింది. దీంతో బ్యాంక్‌ ఏకంగా 43 స్థానాలను మెరుగుపరుచుకుంది. భారత్‌ నుంచి కొత్తగా టైటాన్‌, సన్‌ఫార్మా కొత్తగా టాప్‌ 500 జాబితాల చోటు దక్కించుకున్నాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ట్రాన్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌ కంపెనీలు వాటి విలువలు కోల్పోయాయి. దీంతో ఈ జాబితా నుంచి ఇవి వైదొలిగాయి. ఇటీవల కాలంలో ఆయా కంపెనీల విలువలు పెరిగాయి. మొత్తంగా 18 కంపెనీలతో ఈ జాబితాలో భారత్‌ 6వ స్థానంలో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అల్ఫాబెట్‌, అమెజాన్‌, ఎన్విడియా అత్యంత విలువైన కంపెనీల జాబితాలో టాప్‌-5లో చోటు దక్కించుకున్నాయి. ఈ కంపెనీలన్నీ తొలిసారి లక్ష కోట్ల డాలర్లు దాటాయి. ఇందులో తొలి నాలుగు కంపెనీలు గత సంవత్సరం కూడా అవే స్థానాల్లో ఉన్నాయి. మౖైెక్రోసాఫ్ట్‌ ఎన్నిడియా ఏఐ కంపెనీ చాట్‌జీపీటీతో సంబంధం కలిగి ఉండడంతో వాటి విలువ భారీగా పెంచుకోగలిగాయి. చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐతో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు పెట్టింది. ఎన్నిడియా ఆ కంపెనీకి సెమీకండక్టర్లను సమకూరుస్తోంది. దీంతో కంపెనీ విలువ మూడు రెట్లు పెరిగింది. ఇక ఓపెన్‌ఏఐ 50 బిలియన్‌ డాలర్ల విలువతో 291వ స్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement