Monday, April 29, 2024

AP | ఏవోబీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ బోల్తాప‌డి ముగ్గురు మృతి

పార్వతీపురం మన్యం, (ప్రభ న్యూస్): ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఇవ్వాల రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణపట్నం వద్ద లోయలో బైక్ బోల్తాపడి ముగ్గురు యువకులు అక్కడికక్కడే చ‌నిపోయారు. మృతులు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన జయరాజు, బాలరాజు, శివగా స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement