Wednesday, May 15, 2024

Delhi | ఇండియాగేట్ వద్ద క్యాండిల్ ర్యాలీ.. చంద్రబాబు కోసం టీడీపీ నిరసన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రోజుకోరీతిలో నిరనస ప్రదర్శనలు చేపడుతున్న తెలుగుదేశం యువనేత అడారి కిషోర్ కుమార్ బుధవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గత కొద్దిరోజులుగా వివిధ రూపాల్లో ప్రదర్శనలు చేపడుతున్న ఆయన మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఇండియాగేట్ క్యాండిల్ ర్యాలీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు.

ప్రతిపక్షాలు నోరు విప్పి ఆవేదన చెప్పుకునే అవకాశం కూడా లేదన్నారు. అందరినీ హౌజ్ అరెస్ట్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ ఆంక్షలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమర్జెన్సీ సమయంలోనూ పరిస్థితి ఇంత దారుణంగా లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్ సైతం ఎందుకు స్పందించడం లేదో తెలియదన్నారు. అందుకే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు, రాజ్యాంగ సంస్థలను కలిసి ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రపతితో పాటు ప్రధాన మంత్రి, హోంమంత్రి, జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement