Tuesday, May 14, 2024

క‌లెక్ట‌రేట్ లో రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం…

కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో స్పందన సమావేశ మందిరంలో ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బందరు మండలం మాజేరు గ్రామానికి చెందిన యార్లగడ్డ నరసింహారావు కలెక్టర్ స్పందన హాల్లో ఎండ్రిన్ తాగి ఆత్మహత్యయత్నచేశాడు. గ్రామ కంటకంలో ఉన్న తన ఇంటి స్థల వివాదంపై మూడుసార్లు స్పందన లో అర్జీ ఇచ్చిన పరిష్కారం కాకపోవడంతో సోమవారం పురుగుమందు తాగడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్న అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే అతన్ని మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement