Saturday, May 4, 2024

ఏపీలో విద్యుత్ కోతలకు ఫ్యాన్ తిరగడం లేదు : నాగ‌బాబు సెటైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఫ్యాన్ తిరగడం లేదని సినీ నటుడు, జనసేన నేత నాగబాబు సెటైర్ వేశారు. క‌రెంట్ కోత‌ల‌పై ఆయ‌న‌ స్పందించారు. ఫ్యాన్ తిరగకపోతే వైసీపీ నేతలకూ ఇబ్బందేనని ఎద్దేవా చేశారు. ఏపీలో విద్యుత్ కోతలకు ఫ్యాన్ తిరగడం లేదు. అధికార పార్టీ నేతలు ప్రజలకు ఓ కర్ర ఇస్తే.. దాంతో అయినా ఫ్యాన్ తిప్పుకుంటారు. ఎందుకంటే, ఫ్యాన్ తిరగకపోతే వైసీపీ నాయకులకూ ఇబ్బందే కదా’ అని నాగబాబు చురకలంటించారు. ఈసంద‌ర్భంగా ‘టీ టైమ్’ ఔట్ లెట్ వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జ‌న‌సేన‌లో చేరార‌ని నాగ‌బాబు చెప్పారు. ఏ రాజకీయ శక్తులకు తలొగ్గకుండా జనం కోసం పనిచేస్తున్న జనసేనలో ఆయన చేరడం జన సైనికులకు స్ఫూర్తినిచ్చే అంశమ‌ని నాగ‌బాబు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, టీ టైమ్ ఔట్ లెట్ వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 17 రాష్ట్రాల్లో మూడు వేల టీ దుకాణాలు స్థాపించి.. 20 వేలకు పైగా మందికి ఉపాధి కల్పించారని నాగ‌బాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement