Thursday, April 25, 2024

TS: కాంగ్రెస్ లో మరో వివాదం.. ఆ ముగ్గురిపై అద్దంకి దయాకర్ ఫిర్యాదు

తెలంగాణ కాంగ్రెస్ లో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే పార్టీలోని కొంత మంది నాయకులు ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారమే లక్ష్యంగా అందరు కలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. అయినా, పార్టీలో మాత్రం ఆ మేరకు చర్యలు కనిపించడం లేదు. తాజాగా ఏఐసీసీ పెద్దలకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ లేఖ రాశారు. కాంగ్రెస్ బహిష్కృత నేత వడ్డేపల్లి రవిని పార్టీలో చేర్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 2018లో రవి రెబల్‌గా పోటీ చేసి తన ఓటమికి కారణం అయ్యారని తెలిపారు. పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసిందని లేఖలో పేర్కొన్నారు. ఉత్తమ్, కోమటిరెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆయన్ను పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తుంగతుర్తిలో పార్టీకి నష్టం చేసిన రవిని మళ్ళీ పార్టీలోకి తీసుకొవద్దని అద్దంకి దయాకర్ లేఖలో అద్దంకి దయాకర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement