Sunday, May 5, 2024

Purandeswari: పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలి..

బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కోరారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని పురందేశ్వరి అన్నారు.

రాష్ట్రంలో అవినీతి పెద్ద ఎత్తున పెచ్చుమీరుతుందన్న ఆమె.. ఎపీ ప్రజలు జగన్ పరిపాలన నుంచి విముక్తిని కోరుకుంటున్నారని తెలిపారు. అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీ బీజేపీ పార్టీ అని పురందేశ్వరి ప్రజల కోసం అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement