Wednesday, May 1, 2024

RR: కోటపల్లిలో బోటింగ్ ప్రారంభం

వికారాబాద్, డిసెంబర్ 30(ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కోటిపల్లి ప్రాజెక్టులు శనివారం నాడు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బోటింగ్‌ను పున:ప్రారంభించారు. జెకె ఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి నేతృతంలో ఈ బోటింగ్ కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా అదరపు కలెక్టర్ రాహుల్ శర్మ, వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ సెల్వ రోజుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో బోటింగ్ కు పర్యాటకులు రావడం ఎంతో మంచిదని హైదరాబాద్ నగరానికి సమీపాన ఉన్న కోటిపల్లి ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు సదానంద రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, పాండుగౌడ్, నాయకులు బసవలింగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement