Sunday, May 5, 2024

yellandu : కాంగ్రెస్, బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య వాగ్వాదం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టౌన్ నాలుగో వార్డులో ప్రజా పాలన కార్యక్రమం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులకు, బీఅర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం… తోపులాట జ‌రిగింది.

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ వద్ద పథకాలు అమలు జరిగేనా అంటూ ఒక బీఅర్ఎస్ పార్టీ వ్యక్తి వ్యాఖ్యానించడంతో అక్కడే అన్న కాంగ్రెస్ నేతలు జోక్యం చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement