Wednesday, May 1, 2024

ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారమ‌వుతాయి : మంత్రి పేర్ని నాని

గ‌త కొన్ని రోజులుగా ఏపీలో ఉద్యోగులు నిర‌స‌న బాట ప‌ట్టారు. పీఆర్సీపై ఉద్య‌మానికి తెర‌లేపారు. అయితే ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇవాళ్టీతో ఉద్యోగుల సమస్యలు పరిష్కరమ‌వుతాయని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఉద్యోగుల డిమాండ్లపై మంత్రుల కమిటీ భేటీలో చర్చించామన్నారు. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం జరిపే చర్చలకు ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయన్నారు. మరోసారి చర్చలు జరుపుతామ‌ని, అందువ‌ల్ల ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని మంత్రి పేర్ని నాని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement