Tuesday, May 14, 2024

PM Modi: హైదరాబాద్ పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్!

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో తన పర్యటన వివరాలను మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రెండు కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం కోసం హైదరాబాద్ వెళ్తున్నానని మోదీ తెలిపారు. మధ్యాహ్నం 2.45 గంటలకు ఇక్రిశాట్ 50 ఏళ్ల ఉత్సవాలకు హాజరవుతానని ఆయన చెప్పారు. వ్యవసాయం, ఆవిష్కరణల రంగంలో ఈ సంస్థ విశేషమైన కృషి చేస్తోందని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటానని మోదీ చెప్పారు. తన పవిత్రమైన ఆలోచనలు, ఆథ్యాత్మిక బోధనలతో మనల్ని ఉత్తేజితం చేసిన రామానుజాచార్యుల వారికి ఇది ఘన నివాళి అని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి స్వాగతం పలుకనున్నారు. 11వ శతాబ్దపు భక్తి సాధువు శ్రీ రామానుజాచార్యుల స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement