Sunday, May 5, 2024

వసంత పంచమి పర్వదినం.. బాసరకు పోటెత్తిన భక్తులు

వసంత పంచమి పర్వదినం సందర్భంగా తెలంగాణలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సరస్వతీదేవీ వద్ద అక్షరాభ్యాసం నిర్వహించేందుకు భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. సరస్వతీ అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. బాసర ఆలయంలో మూడు రోజుల పాట వసంత పంచమి వేడుకలు జరగనున్నాయి.

వసంత పంచమిని పురస్కరించుకొని కరీంనగర్ లోని చైతన్యపురి శ్రీ మహాశక్తి దేవాలయంలో మహాసరస్వతీ పూజ, ఫలపంచామృతభిషేకం, కుంకుమార్చన, పుస్తకపూజ, అక్షరస్వీకారాలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement