Saturday, December 2, 2023

Emergency Alert – మీ ఫోన్ కు ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చిందా?…

హైదరాబాద్: మీ మొబైల్‌‌కు అలర్ట్ మెసేజ్ వచ్చిందా? మెసేజ్ వచ్చిన కాసేపటికి శబ్ధం వస్తుందా? ఏంటి? అని కంగారు పడుతున్నారా? అయితే అలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరి మొబైల్ స్క్రీన్లపై ఈ రకమైన మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. మరికొంత మంది ఉలిక్కిపడి.. భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఎవరూ ఆందోళన చెందక్కర్లేదు.

- Advertisement -
   

అసలు విషయం ఏంటంటే..
టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్‌ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో మనకు మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్‌ప్లే అయింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్టింగ్ జరిగింది. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల నుంచి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ఈ ట్రయల్ టెస్ట్ నిర్వహించారు.

మెసేజ్ ఇలానే వచ్చిందా?
ముఖ్యమైన సమాచారం : మీరు మీ మొబైల్‌లో కొత్త శబ్దం మరియు వైబ్రేషన్‌తో అత్యవసర పరిస్థితి గురించి నమూనా సందేశాన్ని అందుకోవచ్చు. దయచేసి భయపడవద్దు, ఈ సందేశం నిజమైన అత్యవసర పరిస్థితిని సూచించదు. ప్రణాళికాబద్ధమైన ట్రయల్ ప్రాసెస్‌లో భాగంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సహకారంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, భారత ప్రభుత్వం ద్వారా ఈ సందేశం పంపబడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement