Friday, May 17, 2024

NZB: సిరికొండలో కత్తిపోట్ల కలకలం

సిరికొండ, సెప్టెంబర్ 21 (ప్రభ న్యూస్): బుధవారం రాత్రి పీడీఎఫ్ బియ్యం కొనుగోలుదారులు ఎంఎన్ పంక్షన్ హాల్లో పార్టీ చేసుకుంటుండగా సడన్ గా హైదరాబాద్ కు చెందిన వ్యక్తి సిరికొండ వాస్తవ్యుడు అన్సారీ పైన కత్తితో దాడి చేసినట్లు తెలిసింది. తీవ్రగాయాలైన అన్సారీని హుటాహుటిన చికిత్స కోసం నిజామాబాదులోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడు అన్సారీ శరీరంపై రెండు కత్తిపోట్ల గుర్తులున్నట్లు తెలిసింది.


కత్తిపోట్లకు గురైన వ్యక్తి రహీం ఇద్దరు కలసి రేషన్ బియ్యం దందా చేసే వారు. ఈ క్రమంలో ఏమయ్యిందో తెలియదు కానీ.. దావత్ నడుస్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి అన్సారీపై దాడి చేసినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement