Monday, May 6, 2024

AP: ట్రాక్టర్ ట్రాలీకి తగిలిన విద్యుత్ వైర్లు.. షాక్ తో డ్రైవర్ మృతి

గంగవరం సెప్టెంబర్ 22 (ప్రభ న్యూస్): మండల కేంద్రం సమీపంలో విద్యుత్ వైర్లకు ట్రాక్టర్ ట్రాలీ తగలడంతో డ్రైవర్ మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ఎద్దుల చెరువుకట్ట ఓంశక్తి ఆలయం చిన్నూరు గ్రామానికి వెళ్లే రహదారిలో ట్రాక్టర్ సహాయంతో మట్టిని తరలిస్తూ, ఓబావిని పూడ్చడానికి డ్రైవర్ ప్రయత్నిస్తున్నాడు. ట్రాక్టర్ హైడ్రాలిక్ ఆన్ చేసి ట్రాలీ వెనుక ఉన్న డోర్ తీయడానికి వెళ్లగా.. ట్రాలీ పైకి లేయడంతో పైనున్న విద్యుత్ వైర్లకు తగులుకొని షాక్ కొట్టి అక్కడికక్కడే బావిలో పడి మృతిచెందాడు.

ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపకశాఖ సిబ్బంది సహకారంతో మృతదేహం కోసం కొన్ని గంటలపాటు కష్టపడి బావిలో నుండి శవాన్ని బయటకు తీశారు. అనంతరం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా మృతుడు పలమనేరు రూరల్ టి.ఒడ్డూరు గ్రామానికి చెందిన రజనిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో మృతుని కుటుంబీకుల ఆర్తనాదాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement