Sunday, May 12, 2024

Breaking: చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 19న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

అయితే స్కిల్ కేసులో సీఐడీ వాదనలను హైకోర్టు సమర్థించింది. కాసేపటి క్రితం చంద్రబాబు క్వాస్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కాసేపట్లో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement