Thursday, April 25, 2024

లారీ – బైక్ ఢీః ఇద్ద‌రి దుర్మ‌ర‌ణం

తాళ్లరేవు మండలం – 216 జాతీయ రహదారి చోల్లంగి వద్ద ఆగి ఉన్న లారీ ని ద్విచక్ర వాహనం డీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు.మృతులు కాట్రేనికొన మండలం పల్లంకుర్రు నుండి కాకినాడ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు పల్లంకుర్రు గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగేశ్వరరావు(31),సమనాసి రాంబాబు(45) గా కోరంగి పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవ‌ర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement