Sunday, April 28, 2024

Pitapuram – అట్టహాసంగా పవన్ నామినేషన్

వేలాదిగా కదిలిన జనసైన్యం
తండోపతండాలుగా తరలివచ్చిన కార్యకర్తలు
టీడీపీ, బీజేపీ నేతల హాజరు
కారుపై అభివాదం చేస్తూ పవన్ చిరునవ్వులు

ఆంధ్రప్రభ స్మార్ట్, పిఠాపురం ప్రతినిధి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగాజనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని నివాసంలో ముందుగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, తన కుటుంబ సభ్యులు, సన్నిహుతుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ లో బయల్దేరి వెళ్లిన ఆయన.. రిటర్నింగ్ అధికారి(ఆర్వో) కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు.

నామినేషన్ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ తీశారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. జై జైనసేన, జైజై పవన్ కల్యాణ్ అంటూ భారీగా నినాదాలు చేశారు. ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ పవన్ కల్యాణ్ ముందుకు సాగారు. ఈ ర్యాలీలో 30 వేల మంది పైగా జనసైనికులు పాల్గొన్నారని అంచనా. చేబ్రోలులోని పవన్ కళ్యాణ్ బస చేసిన ఇంటికి సోమవారం ఉదయం నుంచే పిఠాపురం నలుమూల నుంచి జనసైనికులు తండోపతండాలుగా తరలివచ్చారు. టీడీపీ, బీజేపీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ నేత వర్మ ఈ కార్యక్రమాన్ని పర్వవేక్షించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement