Sunday, April 28, 2024

AP : పిల్లనిచ్చిన మామపై అల్లుడి యాసిడ్ దాడి

భార్యను కాపురానికి పంపడం లేదని పిల్లనిచ్చిన మామపై అల్లుడు యాసిడ్ దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మామ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలోని జంగారెడ్డి మండలం లక్కవరంలో జరిగింది.

ఏలూరు జిల్లాకు చెందిన రమేష్‌కు నాగేశ్వర్ రావు అనే వ్యక్తి కూతురితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి సంసారంలో విభేదాలు తలెత్తాయి. దీంతో రమేష్ భార్య తల్లిగారింటికి వెళ్లిపోయింది.

- Advertisement -

తన భార్యను ఇంటికి పంపాలని రమేష్ కోరగా.. అందుకు మామ నాగేశ్వర్ రావు నిరాకరించాడు. దీంతో మామపై కక్ష పెంచుకున్న రమేష్ ఆదివారం యాసిడ్ దాడి చేశాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ నాగేశ్వర్ రావు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లుడు రమేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న రమేష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement