Thursday, April 25, 2024

పేలిన సిలిండ‌ర్లు – వృద్ధురాలి స‌జీవ‌ద‌హ‌నం..

కాకినాడ : గాంధీ పార్కు సమీపంలో నేటి తెల్ల‌వారుఝామున పేలిన సిలిండ‌ర్ల ప్ర‌మాదంలో వృద్ధురాలు స‌జీవ‌ద‌హ‌న‌మైంది…వివ‌రాల‌లోకి వెళితే పార్క్ స‌మీపంలోని ఒక ఇంటిలో ముందుగా ఒక సిలిండ‌ర్ పేలి భారీగా మంట‌లు వ్యాపించాయి.. పెద్దగా శబ్ధం రావడంతో చుట్టుపక్కల స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో పక్కనున్న ఇళ్లలో కూడా మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న సిలిండర్లు కూడా పేలాయి. ఈ మంటల్లో చిక్కుకొని ఓ వృద్ధురాలు సజీవ దహనం అయ్యింది.. మృతురాలిని తుమ్మల విజయలక్ష్మీ(65)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరణించిన వృద్ధురాలి సోదరి మాట్లాడుతూ.. ప్రమాదం ఎలా జరిగిందో తెలీయదని, ఒక్కసారిగా మంటలు చేలరేగాయని అన్నారు. ఇళ్లు కాలిపోతున్నాయని తన సోదరే అందరికి చెప్పిందని, కానీ బయటకు వచ్చేందుకు దారి లేక తను మంటల్లో చిక్కుకొని మరణించిందని కన్నీరు పెట్టుకున్నారు. ఈ ప్రమాదంలో నాలుగు కుటుంబాలకు ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. అగ్నిమాప‌క సిబ్బంది వ‌చ్చి మంట‌లు మ‌రిన్ని ఇళ్ల‌కు వ్యాపించ‌కుండా ఆర్పివేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement