Tuesday, May 7, 2024

రోక‌లి బండ‌తో భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌..

విశాఖపట్నం: విశాఖలో దారుణం జరిగింది. భర్తపై అనుమానంతో భార్య రోకలిబండతో అతి దారుణంగా భర్తను కొట్టి చంపింది. ఈ ఘటన ఏవీఎన్‌ కాలేజీ ద్వారం వీధిలో తెల్లవారుజామున చోటు చేసుకుంది. భర్త పుండరీకాక్షయ్య పిల్లలను చంపేస్తాడనే భయంతోనే భర్తను హత్య చేసినట్లు భార్య పుణ్యవతి తెలిపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement