Monday, May 6, 2024

ఏడుపాయలలో కరోనా కలకలం


తెలంగాణలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. తాజాగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గాభవాని ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. ఆలయ ఈవోకు కరోనా సోకడంతో భక్తుల దర్శనాలను రద్దు చేశారు. వారం రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అమ్మవారికి నిత్య కైంకర్యాలు యధాతథంగా కొనసాగుతాయని చెప్పారు. ఈ నెల 25వ తేదీ వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. నేటి నుంచి వారం రోజుల పాటు ఏడుపాయల ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు. మార్చి 25 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కొద్దిరోజుల కిందటే అమ్మవారి వార్షిక ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు కరోనా సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement