Monday, April 29, 2024

Breaking : నాటు సారా విక్ర‌యం..38 మంది పై కేసు నమోదు..

కాకినాడ జిల్లాలోని అక్రమ మద్యం, నాటుసారా విక్రయిస్తున్న 38 మందిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రబాబు తెలిపారు.ఈ మేర‌కు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్ ఇబి , పోలీసులు సంయుక్తంగా కాకినాడనార్త్, కాకినాడ సౌత్, పెద్దాపురం,పిఠాపురం,ప్రత్తిపాడు,తుని,రంపచోడవరం,తాళ్లరేవు, ముమ్మిడివరం,రామాచంద్రాపురం,ఆలమూరు,కొత్తపేట,రాయవరం, రంపచోడవరం,మరియు చింతూరు తదితర స్టేషన్ ల పరిధిల్లోని నాటుసారా తయారీ కేంద్రాలు, మద్యం అక్రమ అమ్మకాలపై జరిపిన దాడుల్లో 38 కేసులు నమోదు చేసి 22 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఈ దాడుల్లో 145 లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 38100 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement