Tuesday, May 14, 2024

DY Das – కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే చేరిక

ప్రభన్యూస్, పామర్రు (కృష్ణాజిల్లా) : పామర్రు మాజీ ఎమ్మెల్యే డివై దాస్ కు కాంగ్రెస్ బాట పట్టారు. అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జీ, ఎంపీ మాణిక్యం ఠాగూర్,పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజును కె.వై. దాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో కాంగ్రెస్ కండువాను మాణిక్యం ఠాగూర్ కప్పి కేవై దాస్ను పార్టీలోకి ఆహ్వానించారు ‌ . ఇకపై పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనాలని మాణికం ఠాగూర్ ఈ సందర్భంగా డివై దాస్ ను కోరారు.

క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతుగా శక్తి వంచన లేని కృషి చేస్తానని డి వై దాస్ అన్నారు.తన సేవలతో మాతృ సంస్థ కాంగ్రెస్ కు పునరంకితుడ్ని అవుతానన్నారు. పార్టీలోకి తన పునః ప్రవేశం తదనంతర పరిణామాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు త్వరలో ఓ ముఖ్య సమావేశం జరుగుతుందని ఈ సందర్భంగా డి వై దాస్ తెలిపారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు జెడి శీలం, పళ్ళంరాజు ,రఘువీరారెడ్డి, కనుమూరి బాపిరాజు , సుంకర పద్మశ్రీ, వి సంజీవరెడ్డి, మొవ్వా మోహన్ రావు, పెదపూడి దిలీప్పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement