Monday, May 6, 2024

Bellampalliలోనూ కారుకు షాక్….21 మంది కౌన్సిలర్లు రాజీనామా ..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పుర రాజకీయం మలుపు తిరిగింది. 21 మంది కౌన్సిలర్లు భారాస కు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. 19 మంది సంతకాలు చేసి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు. సంతకాలు చేయనప్పటికీ వైస్‌ ఛైర్మన్‌ సుదర్శన్‌తో పాటు 14వ వార్డు కౌన్సిలర్‌ బొడ్డు నారాయణ సైతం రాజీనామాకు అంగీకరించినట్లు స‌మాచారం …

రేపు అవిశ్వాస బ‌ల‌ప‌రీక్ష‌…. అంత‌లోనే రాజీనామాలు

కాగా, బెల్లంప‌ల్లి మున్సిపాలిటీలో ఛైర్మ‌న్ రేపు అవిశ్వాస ప‌రీక్ష ఎదుర్కొనున్నారు.. ఈ నేప‌థ్యంలోనే వారం క్రితం భారాసకు చెందిన 18 మంది కౌన్సిలర్లు అజ్ఞాత శిబిరానికి తరలి వెళ్లారు. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారంతా రాజీనామా నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగాల్సి ఉంది. బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. వీటిలో ఒక వార్డు కౌన్సిలర్‌ గతంలో మృతి చెందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 11 మంది, భాజపాకు ఒకరు మద్దతు ఇస్తున్నారు. భారాసకు చెందిన 21 మంది రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement