Monday, May 20, 2024

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన – డ్ర‌గ్ కంట్రోల్ ఏడీ

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కి రెడ్ హ్యండెడ్ గా ప‌ట్టుబ‌డ్డాడు తిరుప‌తి డ్ర‌గ్ కంట్రోల్ ఏడీ చ‌క్ర‌వ‌ర్తి. మెడికల్‌ ఏజెన్సీ రెన్యూవల్‌ కోసం రూ. 20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. తిరుపతి పట్టణంలోని వేదాద్రి మెడికల్‌ ఏజెన్సీ యజమాని విజయసారథి ఏజెన్సీరెన్యూవల్‌ కోసం దరఖాస్తు సమర్పించుకున్నాడు. అయితే తిరుపతి డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీ చక్రవర్తి అందుకు రూ. 29 వేలు డిమాండ్‌ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి వ్యూహం ప్రకారం బాధితుడు తిరుపతి ప్రకాశం పార్క్‌ వద్ద ఏడీకి రూ. 20వేలు లంచం ఇస్తుండగా అక్కడే మాటువేసిన అధికారులు ఏడీని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసిన అధికారులు ఏడీ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement