Friday, April 26, 2024

చెట్టును ఢీ కొన్న కారు – డీఈవో కి గాయాలు

శ్రీ సత్య సాయి విద్య, జూన్ 1 (ప్రభ న్యూస్) గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ సత్య సాయి జిల్లా విద్యాశాఖ అధికారిని మీనాక్షి , రామగిరి ఇన్చార్జ్ ఎంఈఓ గోపాల్ తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలం లో ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించడానికి వెళ్ళిన శ్రీ సత్య సాయి జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి ప్రయాణిస్తున్న కారు నసనకోట సమీపంలో చెట్టుకు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న డీఈవో మీనాక్షికి తీవ్ర గాయాలయ్యాయి.

పనుల పరిశీలనగాను డీఈవో వెంట వెళ్లిన రామగిరి ఇన్చార్జి మండల విద్యాశాఖ అధికారి గోపాల్ సైతం తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు స్పందించి గాయపడ్డవీరిని కారులో నుంచి బయటకు తీసి హుటాహుటిన రామగిరిలోనే ప్రభుత్వాసుపత్రి కి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో శ్రీ సత్య సాయి జిల్లా విద్యాశాఖ అధికారిని మీనాక్షి గాయపడ్డారని విషయం తెలియగానే శ్రీ సత్య సాయి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం సిబ్బంది స్పందించి డిఈఓ క్షేమ సమాచారాన్ని కనుక్కున్నారు. డీఈఓ ప్రమాదనికి గురి కావడం పట్ల కార్యాలయ సిబ్బంది తీవ్ర దిగ్బంతి వ్యక్తపరిచారు. డీఈవో త్వరగా కోలుకోవాలని వీరు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement