Wednesday, May 22, 2024

Delhi – మరి కొద్దిసేపటిలో ప్రధాని మోదీతో జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనకు బయలు దేరారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్ర కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు..

ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు ఉదయం 11.15 గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. ఆ తర్వాత అమిత్‌ షాతో భేటీ కానున్నారు సీఎం జగన్‌. ఏపీలో పొత్తులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందించాలని, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు, విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్‌ ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement