Sunday, May 5, 2024

ఏనుగుల దాడిలో మృతుల కుటుంబాలకి.. రూ. 10 లక్షల పరిహారం.. ఎమ్మెల్సీ భరత్

కుప్పం, ప్రభ న్యూస్ : కుప్పం మండలం మల్లనూరు ప్రాంతంలో ఏనుగుల దాడిలో మృతి చెందిన రెండు కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల మేర ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర అటవీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆమోదం తెలిపినట్లు ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అటవీ శాఖ అధికారులు తొలుత ఈ సాయం రూ.5 లక్షలుగా ప్రకటించడం జరిగిందని . దీనిపై తాను మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి .. మృతుల కుటుంబల పరిస్థితిని వివరించగా.. దీనిపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశార‌న్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారని భరత్ అన్నారు.. అదేవిధంగా ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబలకు నష్ట పరిహారం మొత్తాన్ని 10 లక్షలకు పెంచుతూ అధికారులకు ఆదేశాలు ఇస్తానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తెలియజేసినట్లు ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఉదారంగా స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఎమ్మెల్సీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement