Tuesday, April 30, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. నిండిన 10కంపార్టు మెంట్లు

శ్రీవారి భ‌క్తుల‌తో 10కంపార్ట్ మెంట్లు నిండాయి. దాంతో తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది.కాగా టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 59,090 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 22,593 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.03 కోట్లు వచ్చిందని తెలిపారు.హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 20 నుంచి 28 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. ఇందుకుగాను ఈనెల 19న మెగా ఉత్సవానికి అంకురార్పణ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 20న ధ్వజారోహణం, 24న గరుడసేవ, 27న రథోత్సవం, 28న చక్రస్నానం, మార్చి 1న పుష్పయాగం నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement