Thursday, May 2, 2024

సీఎం కేసీఆర్ కు సీపీఐ జాతీయ నేతల ఆహ్వానం

సీపీఐ జాతీయ నేతల ఆహ్వానం మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విజయవాడకు వెళ్లనున్నారు. అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడ కేంద్రంగా జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సభకు కేరళ, బీహార్ సీఎంలతో పాటు 20దేశాలకు చెందిన కమ్యూనిస్ట్ నేతలు హాజరు కానున్నారు. మూడేళ్ళ క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించేందుకు స్వయంగా విజయవాడ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విజయవాడకు రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement